హైదరాబాద్ : తెలంగాణలో పాలిటెక్నిక్ మొదటి విడత సీట్ల కేటాయింపు పూర్తయ్యింది. రాష్ట్రంలోని 120 కళాశాలల్లో 24,156 సీట్లు విద్యార్థులకు కేటాయించారు. మరో 4,471 సీట్లు మిగిలినట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. 62 కళాశాలల్లో సీట్లన్నీ భర్తీ అయినట్లు ఆయన పేర్కొన్నారు. తొలి విడత సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 20 వరకు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని సూచించారు. సెప్టెంబర్ 6 నుంచి పాలిటెక్నిక్ కళాశాలల్లో తరగతులను ప్రారంభిస్తామని నవీన్ మిట్టల్ వెల్లడించారు.