నల్లగొండ: జిల్లాలోని అనుముల మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని టిప్పర్ ఢీకొట్టింది. దీంతో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. మండలంలోని చింతగూడెం వద్ద వేగంగా వచ్చిన టిప్పర్ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉన్నది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..