కరీంనగర్ : హుజురాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నికలు త్వరలో ఉన్నందున ఈవీఎంల మొదటి స్థాయి (ఫస్ట్ లెవల్ చెకింగ్) చేసినట్లు జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. సోమవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోడౌన్లో గల ఈవీఎంలను, వి.వి. ప్యాట్లను తనిఖీ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. హుజురాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నిక త్వరలో ఉన్నందున ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈవీఎంలు, వి.వి. ప్యాట్ల మొదటి స్థాయి తనిఖీ వివిధ రాజకీయ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీ చేసినట్లు పేర్కొన్నారు.
ఈ తనిఖీల పట్ల వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్, కలెక్టరేట్ ఏవో లక్ష్మారెడ్డి, కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ, తెలుగుదేశం పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.