డ్రైవర్కు తీవ్రగాయాలు.. ఓఆర్ఆర్పై ఘటన
కొత్తూరు రూరల్, జులై 22: అది ఔటర్ రింగ్రోడ్డు. ఇండికా కారు రయ్య్మని దూసుకుపోతున్నది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కాలనీ సమీపంలోకి రాగానే ఒక్కసారిగా కారు ఇంజిన్ పేలిపోయింది. కారు నిండా పొగ కమ్ముకున్నది. మంటలు వ్యాపించాయి. కారులో ఉన్న వ్యక్తి బయటికొచ్చేందుకు ఎంత ప్రయత్నించినా డోర్ తెరుచుకోలేదు. మంటలకు తట్టుకోలేక పెద్ద కేకలు వేశాడు. అటుగా వెళ్తున్న వాహనదారులు మంటలంటున్న కారును గమనించారు. ఆపదను పసిగట్టి వెంటనే స్పందించారు. కారు అద్దాలు పగలగొట్టి వ్యక్తి ప్రాణాలు కాపాడారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పరిధిలోని ఔటర్రింగ్రోడ్డుపై గురువారం ఉదయం చోటుచేసుకున్నది. బాధితుడిని కొత్తూరు మండలకేంద్రానికి చెందిన పబ్బటి శ్రీనివాస్గుప్తాగా గుర్తించారు. అక్కడే ఓ పరిశ్రమలో ఆయన కారు డ్రైవర్గా పనిచేస్తున్నారు. కారులో హైదరాబాద్కు వెళ్తుండగా.. ఈ ప్రమాదం జరిగింది. తీవ్ర గాయాలైన శ్రీనివాస్ను అంబులెన్స్లో ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు.