జనగామ-స్టేషన్ ఘన్పూర్ : జిల్లా పరిధిలోని స్టేషన్ ఘన్పూర్లో శుక్రవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ తక్షణమే ప్రయాణికులను దించేశారు. హన్మకొండ నుంచి హైదరాబాద్కు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. బస్సు మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.