హైదరాబాద్/పహాడీషరీఫ్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరశివారు మామిడిపల్లిలో ట్రాన్స్కోకు చెందిన 400 కేవీ సబ్స్టేషన్లో గురువారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రాత్రి 7.45 గంటల సమయంలో అంతర్గత సాంకేతిక సమస్యలతో 315 ఎంవీఏ పవర్ట్రాన్స్ఫార్మర్లో మంటలు చెలరేగాయి. ట్రాన్స్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు, ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, జేఎండీ శ్రీనివాసరావు, డైరెక్టర్ జగత్రెడ్డి హుటాహుటిన మామిడిపల్లికి వెళ్లారు. ట్రాన్స్కోకు రూ.2 కోట్లమేర ఆస్తినష్టం వాటిల్లినట్టు తెలిపారు.