హైదరాబాద్: హైదరాబాద్ శివార్లలోని శంకరపల్లి మండలంలో దారుణం జరిగింది. మండలంలోని జన్వాడలో ఉన్న ఓ టెంట్ హౌస్ను గుర్తుతెలియన వ్యక్తులు తగలబెట్టారు. గ్రామానికి చెందిన తలారి బాగయ్య కుటుంబం టెంట్ హౌస్ నడుపుతూ జీవనం సాగిస్తున్నది. ఈ క్రమంలో కొందరు దుండగులు టెంట్ హౌస్ను తగలబెట్టారు. తెల్లవారుజామున ఎగిసిపడుతున్న మంటలను చూసి స్థానికులు అప్రమత్తమయ్యారు. మూడు గంటల పాటు శ్రమించి మంటలార్పారు. ఈ ప్రమాదంలో రూ.25 లక్షల విలువైన సామగ్రి దగ్ధమయింది. బాధితుడు నార్సింగ్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి.. వివరాలు సేకరించారు.