పారిస్: ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-3లో భారత మహిళల రికర్వ్ టీమ్ ఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన టీమ్ ఈవెంట్ సెమీస్లో దీపికా కుమారి, అంకితా భక్త్, కోమలికా బారీతో కూడిన భారత త్రయం 6-2తో ఫ్రాన్స్పై విజయం సాధించింది. ఆదివారం జరిగే ఫైనల్లో మెక్సికో జట్టుతో భారత్ తలపడుతుంది. మరోవైపు తన భర్త అతాను దాస్తో కలిసి మిక్స్డ్ ఈవెంటులో దీపికా కుమారి ఫైనల్లోకి ప్రవేశించింది.