ములుగు : జిల్లాలో ఫీవర్ సర్వే ముమ్మరంగా కొనసాగుతున్నది. కరోనా రోజు రోజుకు విజృంభిస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటా జ్వర సర్వే నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగా జిల్లా కేంద్రంలో ఇంటింటికి వెళ్లి కరోనా వ్యాధి లక్షణాలు ఉన్న వారిని గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
వైద్య సలహాలు, మందులను అందిస్తున్నారు. ఎవరు కూడా అధైర్య పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పలు సూచనలు చేస్తున్నారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
మైనర్ వివాహాన్ని అడ్డుకున్న పోలీసులు
అంబులెన్స్లోనే కరోనా గర్భిణి ప్రసవం
సీఎం కేసీఆర్ వెంటే మంథని ప్రజలు
అజిత్ సింగ్ మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం
కరోనా కష్టకాలంలో రైతులను ఆదుకుంటున్న ప్రభుత్వం