హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): శాలపల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు సభ జాతరను తలపించిం ది. సమ్మక్క జాతరకు పోయినట్టు.. కొండగట్టు అంజన్నను ద ర్శించుకునేందుకు వెళ్లినట్టు నియోజకర్గంలోని ప్రతీ పల్లె నుం చి ఇంటిల్లిపాది కదిలింది. ఊరూరా దండోరా మోగిస్తూ డప్పు దరువులతో కదం తొక్కింది. మహిళలు బోనాలు, బతుకమ్మలతో కదం తొక్కారు. హుజూరాబాద్ నుంచి జమ్మికుంట దాకా దారిపొడవునా జనప్రవాహం తరలివచ్చింది.
పులకించిన శాలపల్లి
మధ్యాహ్నం 2.42 గంటలకు సీఎం కేసీఆర్ రాగానే సభా ప్రాంగణం ఒక్కసారిగా పులకించిపోయింది. ‘జై కేసీఆర్.. వర్ధిల్లాలి దళితబంధు కేసీఆర్’ అంటూ సభికులు లేచి నిలబడి చప్పట్లు కొడుతూ కృతజ్ఞతాపూర్వక వందనం సమర్పించారు. ఈలలు.. కేరింతలతో సభా ప్రాంగణం మార్మోగింది. సీఎం కేసీఆర్ ప్రసంగాన్ని సభికులు తరగతి గదిలో విద్యార్థుల్లా వి న్నారు. ‘ఏకాన పెట్ట లేనోడు.. ఐదు రూపాయలు కూడా ఇ య్య లేనోడు’ కూడా మాట్లాడేవాడైండు’ అని సీఎం కేసీఆర్ మాట్లాడుతుండగానే ‘ఏకాన ఇయ్యనోడిని ఏట్ల తొక్కుడే..’ అంటూ జనం పెద్ద పెట్టున స్పందించారు. ‘ఇచ్చెటోడు ఇస్తడు.. తీస్కునెటోడు తీస్కుంటడు.. మధ్యలవానికేం నొప్పి’ అని సీఎం కేసీఆర్ ప్రశ్నించగానే జనం నుంచి కేరింతలు.. 75 ఏండ్ల స్వాతంత్య్ర భారతదేశంలో దళితులను పట్టించుకున్న పాపాన పోలేదని సీఎం కేసీఆర్ చెబుతున్నప్పుడు.. మా పాలి ట దేవుడు సీఎం కేసీఆర్ ఉన్నడు అంటూ పెద్దపెట్టున నినదించారు. ‘దళితవాడలు బంగారు మేడలు కావాలె. అదే నా స్వప్నం’ అని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఒక్క హుజూరాబాద్తో మాత్రమే ఆగిపోయే ఉద్యమం కాదని తేల్చిచెప్పా రు. రైతులందరికీ రైతుబంధు వర్తించినట్టే ప్రతీ దళితకుటుంబానికి (ప్రభుత్వ ఉద్యోగి అయినా సరే) దళితబంధు వర్తింపజేస్తామని స్పష్టంచేయడంతో ప్రజలు హర్షం వ్యక్తంచేశారు.
సీఎంతో వేదికపై లబ్ధిదారులు
దళితబంధు పథకం ద్వారా దళితులు ఆర్థిక, సామాజిక, పారిశ్రామిక సమానత్వాన్ని సాధించబోతున్నారనే స్పష్టమైన సందేశాన్ని సీఎం కేసీఆర్ ఈ వేదిక ద్వారా ఇచ్చారు. సభావేదికకు ఇరువైపులా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్, బాబూ జగ్జీవన్రాం చిత్రపటాలను ప్రదర్శించి వారి ఆశయాలను నెరవేర్చబోతున్నామనే విశ్వాసాన్ని దళిత సమాజంలో నింపారు. పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైన నియోజకర్గంలోని 15 మంది లబ్ధిదారులను వేదిక మీద సీఎం కేసీఆర్తో సమానంగా కూర్చోబెట్టారు. ప్రభుత్వం ప్రారంభించిన ఏ పథకమైనా ప్రసంగాలు అయిపోయాక లబ్ధిదారులను వేదిక మీదికి పిలవడం ఆనవాయితీ. అయితే, అందుకు విరుద్ధంగా సీఎం ప్రకటించినట్టుగానే దీన్నొక పథకంగా కాకుండా ఉద్యమంగా ప్రకటించారు.
టీఆర్ఎస్ సంస్కారానికి దర్పణం
టీఆర్ఎస్ ప్రభుత్వం తన సంస్కారాన్ని మరోసారి పాదుకొల్పిందనే ఆసక్తికరమైన చర్చ సభాప్రాంగణంలో కొనసాగింది. సభావేదిక మీద సీఎం కేసీఆర్తోపాటు మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ ఇతర ప్రజాప్రతినిధులతోపాటు బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ సంజయ్ ఫొటోను కూడా ప్రముఖంగా పెట్టారు. ‘ఈటల రాజేందర్ కూడా బండి సంజయ్ ఫొట్వ పెట్టుకుంటలేడు కానీ, కేసీఆర్ సారూ ఆయన ఫొట్వ పెట్టుకున్నారని’ ఎంతైనా మర్యాద మర్యాదే అని సభికులు చర్చించుకోవటం విశేషం.
అసాధారణ ఏర్పాట్లు
దళితబంధు పథకాన్ని ప్రారంభించే సీఎం కేసీఆర్.. హాజరయ్యే మంత్రులు.. ఇతర ప్రజాప్రతినిధులకు ఎలాంటి సౌకర్యం కల్పించారో.. సభకు వచ్చిన జనానికి అదేవిధంగా అసాధారణ ఏర్పాట్లు చేశారు. 30 ఎకరాల సువిశాల సభా ప్రాంగణంలో ఏ మూలకు కూర్చున్నా సీఎం కేసీఆర్ ప్రసంగాన్ని కళ్లారా చూస్తూ వినేలా భారీ ఎల్ఈడీ స్క్రీన్లను వినియోగించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రతీ ఒక్కరికీ కుర్చీలు వేశారు. సభా ప్రాంగణానికి వెళ్లే ద్వారం వద్ద మాస్క్లేనివారికి మాస్క్లు ఇచ్చి లోపలికి అనుమతించారు.