రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్
ఇబ్రహీంపట్నంలో లిమ్స్ దవాఖాన ప్రారంభం
ఇబ్రహీంపట్నం, మార్చి 28 : కరోనా రెండో దశ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్య శాఖమంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఆదివారం ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో లైఫ్కేర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (లిమ్స్) దవాఖానాను ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన దవాఖాన సిబ్బందికి పలు సూచనలు, సలహాలను అందించారు. ముఖ్యంగా ప్రైవేటు దవాఖానలు కరోనా వ్యాధి నియంత్రించడంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కరోనా వ్యాపించకుండా ప్రతి ఒక్కరూ మాస్ ధరించి, భౌతిక దూరం పాటించాలన్నారు. ఏప్రిల్ నుంచి 45 ఏండ్లు నిండిన ప్రతిఒక్కరికీ టీకా వేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసిందన్నారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడుతూ..ప్రజలు జాగ్రత్తగా ఉండడానికి సూచనలు, సలహాలను అందించాలన్నారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి మాట్లాడుతూ.. ఇబ్రహీంపట్నంలో అత్యాధునిక వసతులతో లిమ్స్ దవాఖాన ఏర్పాటు చేయడంతో ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు క్యామ మల్లేశ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్తువెంకటరమణారెడ్డి, జడ్పీటీసీ మహిపాల్, మున్సిపల్ చైర్ పర్సన్ స్రవంతి, వైస్ చైర్మన్ యాదగిరి, మంచాల ఎంపీపీ జాటోతు నర్మద, యాచారం ఎంపీపీ కొప్పు సుకన్య, కౌన్సిలర్లు, జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు బూడిద రాంరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షులు యంపల్ల నిరంజన్రెడ్డి, చీరాల రమేశ్, లిమ్స్ దవాఖాన ఎండీ రామరాజు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
ఫ్రిజ్లో వీటిని అసలు పెట్టకూడదు