వనపర్తి : ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా మంత్రి నిరంజన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మంత్రి పుట్టిన రోజును పురస్కరించుకొని స్వచ్ఛందంగా నాయకులు, పలువురు వ్యక్తులు వనపర్తి నియోజకవర్గంలోని పలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు 37 వేల లాంగ్ నోటు బుక్కులు, 20 వేల పెన్నులు, 20 వేల పెన్సిళ్లు, 500 స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు.
దాచ లక్ష్మయ్య ఫంక్షన్ హాల్ లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.
మొత్తం 157 యూనిట్ల రక్తం సేకరించారు. అలాగే 148 మంది లబ్ధిదారులకు రూ.63.31 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. వనపర్తిలోని తన నివాసంలో దివ్యాంగులతో సహపంక్తి భోజనం చేశారు. పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా భాగ్యనగర్ పోస్ట్ సంచిక, జలాక్షరమ్ కవితా సంపుటిని మంత్రి ఆవిష్కరించారు.
వనపర్తి బార్ అసోషయన్ ఆధ్వర్యంలో తాగునీటి కోసం ఆర్వో ప్లాంట్ను వితరణ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ సహకారంతో ఉమ్మడి పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేయడమే తన లక్ష్యమన్నారు.
సాగునీటితో వ్యవసాయం సుస్థిర మవుతుందని తెలిపారు. వ్యవసాయ అనుబంధ పరిశ్రమల ఏర్పాటుతో స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. పేదల అభ్యున్నతే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమన్నారు.
ఇవి కూడా చదవండి..
Crime news | అక్రమ సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడని..
Esha Gupta | ఇషా గుప్తా బికినీ సెగలు
తనను నిర్బంధించిన గదిని ఊడ్చిన ప్రియాంకా గాంధీ.. వీడియో వైరల్
Pandora Papers | ఏంటీ పండోరా పేపర్స్.. సచిన్ విదేశీ ఆస్తులపై ఏం చెప్పింది?