బుడాపెస్ట్ : చైనాకు వ్యతిరేకంగా ఐరోపాలో ఆందోళనలు మిన్నంటాయి. ఇక్కడ ఏర్పాటుచేయ తలపెట్టిన చైనా ఫుడాన్ విశ్వవిద్యాలయం వద్దే వద్దంటూ హంగేరియన్లు భారీ ఆందోళన చేపట్టారు. వేల సంఖ్యలో హంగేరియన్లు వీధుల్లోకి వచ్చి చైనా ఆధిపత్యానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఒకే నెలలో ఇంత భారీగా నిరసన చేపట్టడం ఇది రెండోసారి. చైనా ఒత్తిడి మేరకు హంగేరియన్ ప్రభుత్వం రాజధాని బుడాపెస్ట్లో ఈ క్యాంపస్ను ప్రారంభించేందుకు ఆమోదం తెలిపింది. దేశంలో చైనా విశ్వవిద్యాలయం క్యాంపస్ తెరిస్తే అది కమ్యూనిస్ట్ భావజాలాన్ని ప్రోత్సహిస్తుందని, కమ్యూనిస్టులు ఆధిపత్యం చెలాయిస్తారని నిరసనకారులు ఆరోపించారు.
హంగేరి రాజధాని బుడాపెస్ట్లో చైనాకు చెందిన ఫుడాన్ విశ్వవిద్యాలయ క్యాంపస్ నెలకొల్పేందుకు హంగేరియన్ ప్రభుత్వం గత ఏప్రిల్ నెలలో ఆమోదం తెలిపింది. ఉన్నత విద్యలో సంస్కరణలు తీసుకురావడానికి ఈ విశ్వవిద్యాలయం అవసరమైని నిర్ణయించినట్లు ప్రధానమంత్రి విక్టర్ ఓర్బన్ అన్నారు. విక్టర్ను చైనా అనుకూలురుగా భావిస్తారు. తొలుత పెద్దగా వ్యతిరేకత లేనప్పటికీ.. ప్రస్తుతం వేలాది మంది వీధుల్లోకి వచ్చి చైనాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే, ఫుడాన్ ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయం అని, ఇది విద్యా స్థాయిని మెరుగుపరుస్తుందని ప్రభుత్వం చెప్తున్నది.
జీ 7 సమ్మిట్ : గ్లోబల్ టాక్సేషన్ సిస్టంకు గ్రీన్సిగ్నల్
ICAI CA 2021: సవరించిన షెడ్యూల్ విడుదల
లిలిబెట్ డయానా : రెండోసారి తల్లిదండ్రులైన హ్యారీ, మేఘన్
చరిత్రలో ఈరోజు.. తొలి వన్డే వరల్డ్ కప్ ప్రారంభం
రుతుపవనాల ప్రభావం : శ్రీలంక జలమయం, 14 మంది మృతి
నీట్, జేఈఈ మెయిన్స్ : వచ్చే వారం షెడ్యూల్ విడుదల..!
ఇమ్రాన్ మాట : భారత్తో చర్చలకు సిద్ధమే, కానీ..
అదే స్వరం : కొవిడ్కు చైనాదే బాధ్యత అన్న ట్రంప్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..