నాగర్కర్నూల్ : నిత్యం మద్యం సేవిస్తూ కుటుంబ సభ్యులను వేధిస్తున్న తండ్రిని.. సొంత కుమారుడే కొట్టి చంపాడు. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లాలోని కోడేరు మండల కేంద్రంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. పోడేళ్ల కురుమయ్య (48) అనే వ్యక్తి నిత్యం మద్యం సేవిస్తూ భార్యను, పిల్లలను వేధింపులకు గురి చేస్తున్నాడు. గురువారం రాత్రి కూడా పీకల దాకా మద్యం సేవించి కుటుంబ సభ్యులతో కురుమయ్య గొడవ పడ్డాడు.
తండ్రి ఆగడాలను భరించలేక.. సహనం కోల్పోయిన కుమారుడు మద్దిలేటి ఇనుపరాడ్తో దాడి చేశాడు. దీంతో కురుమయ్య ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మద్దిలేని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.