న్యూఢిల్లీ, మార్చి 27: ఛాతిలో అసౌకర్యంగా ఉందని సైనిక దవాఖానలో చేరిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను వైద్యులు శనివారం మధ్యాహ్నం ఢిల్లీలోని ఎయిమ్స్కు తరలించారు. మంగళవారం ఆయనకు బైపాస్ సర్జరీ చేయనున్నట్టు తెలుస్తున్నది.‘రాష్ట్రపతికి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు… బైపాస్ సర్జరీ చేయించుకోవాలని సూచించారు. ఎయిమ్స్లో మంగళవారం ఆయనకు బైపాస్ సర్జరీ చేసే అవకాశముంది’ అని రాష్ట్రపతి భవన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.