కందుకూరు : రైతులు ఇతర పంటలపై దృష్టి సారించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టరు అమోయ్ కుమార్ తెలిపారు. సోమవారం మండల పరిధిలోని గుమ్మడవెల్లి గ్రామాన్ని సందర్శించి రైతులతో మాట్లాడుతూ, ఆరుతడి పంటను వేసుకోవాలని ఆయన సూచించారు.
యాసంగిలో తెలంగాణలో ఉత్పత్తి అయ్యే వరిని ఎఫ్సీఐ (భారత ప్రభుత్వం ) సేకరించడం లేదని తెలిపారు. అందుకోసం యాసంగిలో వరి కొనుగోలు కేంద్రాలు ఉండవని చెప్పారు. ఈ సీజన్లో రైతులు ప్రత్యామ్నాయ పంటలను వేసుకోవాలని సూచించారు. వరి సాగు చేసే రైతులు పంటలను అమ్ముకునేందుకు సొంతంగా ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు.
వీటికి బదులుగా ఇతర పంటల సాగును పెంచుకోవాలని సూచించారు. అందుకోసం రైతులను పోత్సహిస్తున్నట్లు ఆయన తెలిపారు. రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ప్రత్యమ్నాయ పంటలు, వేరు సెనగ, కంది, పెసర, కుసుమలు వేసుకోవాలని రైతులకు సూచించారు.
కార్యక్రమంలో కందుకూరు డివిజన్ ఇంచార్జీ ఆర్డీఓ వెంకటాచారి, వ్యవసాయ అధికారి యాదగిరి, ఏఈఓ అర్చన, సర్పంచ్ గౌర ప్రభాకర్, ఎంపీటీసీ రేఖ.వార్డు మెంబర్ శ్రీనివాస్ గౌడ్, నర్సింహ, మల్లేష్, పీఎసీఎస్ డైరెక్టరు వెంకటేష్, రైతులు పల్స జగన్గౌడ్, తిరుపతయ్య, వెంకటేష్గౌడ్, అంజయ్య, కిరణ్, భిక్షపతి, సత్తయ్యలు పాల్గొన్నారు.