అమృత్సర్: పంజాబ్లో కొత్త జిల్లా ఏర్పాటయ్యింది. ముస్లిం జనాభా అధికంగా ఉన్న మాలేర్కోట్లను కొత్త జిల్లాగా ఏర్పాటు చేస్తున్నట్లు పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్సింగ్ ప్రకటించారు. మాలేర్కోట్ల ప్రజలు ఎన్నో ఏండ్లుగా తమకు ప్రత్యేక జిల్లాను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారని, ఇన్నాళ్లకు రంజాన్ కానుకగా వారి డిమాండ్ నెరవేరిందని సీఎం పేర్కొన్నారు.
ఇప్పటివరకు మాలేర్కోట్లు సంగ్రూర్ జిల్లాలో భాగంగా ఉండేదని, ఈ క్షణం అది ప్రత్యేక జిల్లాగా అవతరించిందని అమరీందర్సింగ్ చెప్పారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు పంజాబ్లో 13 జిల్లాలు ఉండేవని, నిన్నటి వరకు ఆ సంఖ్య 22 గా ఉన్నదని సీఎం తెలిపారు. తాజాగా మాలేర్కోట్ల 23వ జిల్లాగా అవతరించిందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు తాను కొత్త జిల్లాను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు.