ఆర్మూర్లో పసుపు రైతుల నిరసన.. ఎంపీకి వ్యతిరేకంగా నినాదాలు

అర్మూర్ : పట్టణ శివారులోని 44వ జాతీయ రహదారిపై శనివారం పసుపు రైతులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్కు వ్యతిరేకంగా రైతులు నినదించారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని, పంటకు కనీమ మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ ఫస్ట్ ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో రైతులు ఆందోళన బాట పట్టారు. పార్లమెంట్ ఎన్నికల్లో పసుపు బోర్డు తీసుకువస్తామని చెప్పి.. గెలిచిన తర్వాత ఎంపీ ముఖం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ పదవికి వెంటనే రాజీనామా చేసి, రైతులతో కలిసి ఆందోళనల్లో పాల్గొనాలన్నారు. పసుపు మద్దతు ధర కల్పించే వరకూ పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు. దశలవారీగా ఉద్యమం కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. రైతుల ఆందోళనతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు నిరసన ప్రాంతానికి చేరుకొని.. వాహనాలను ఇతర ప్రాంతాల నుంచి మళ్లిస్తున్నారు. ఇదిలా ఉండగా.. పసుపు రైతులకు ప్రొఫెసర్ నాగేశ్వర్ మద్దతు ప్రకటించి, ఆందోళనలో పాల్గొన్నారు.
తాజావార్తలు
- నేనొచ్చింది నా మనసులో మాట చెప్పేందుకు కాదు: రాహుల్గాంధీ
- అమెజాన్ క్విజ్.. ఫ్రీగా ఐఫోన్12.. ఇవీ సమాధానాలు
- 241 ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్
- ఇంధన ధరల పెరుగుదలపై కేంద్రంపై రాహుల్ ఆగ్రహం
- టీమిండియాను సర్కస్లో జంతువులలాగా చూశారు!
- 28న WEF సదస్సులో ప్రధాని ప్రసంగం..!
- కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ.. 14 మంది అరెస్ట్
- ఢిల్లీలో పాకిస్థాన్ జిందాబాద్ నినాదాలు.. ఎవరు వాళ్లు?
- వ్యాక్సిన్ తీసుకున్న ఆశావర్కర్ మృతి
- పటాన్చెరులో ఏటీఎం చోరీకి విఫలయత్నం