ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్
మహబూబ్నగర్, ఏప్రిల్ 28 : కొవిడ్ నిబంధనలు పాటిస్తూ రైతులు ధాన్యాన్ని విక్రయించాలని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ సూచించారు. బుధవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బైపాస్రోడ్డు, మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరోనా సమయంలో పండించిన ధాన్యం విక్రయించేందుకు రైతులు ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారని చెప్పారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. కేంద్రాలకు తీసుకొచ్చే ధాన్యం పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని రైతులకు సూచించారు.