మెదక్, మే 2 :జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణంలోని ఫత్తేనగర్ వీధిలో పేక ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని జిల్లా టాస్క్ఫోర్స్ సీఐ మురళీకుమార్ తెలిపారు. ఆదివారం సీఐ మాట్లాడారు. ఎస్పీ చందనదీప్తి ఆదేశాల మేరకు నమ్మదగిన సమాచారంతో మెదక్ పట్టణంలోని ఫత్తేనగర్ వీధిలోని ఓ అద్దె ఇంట్లో రహస్యంగా పేక ఆడుతున్న వారిపై ఆకస్మిక దాడి చేసి పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నామన్నారు. వారి వద్ద నుంచి రూ.23,110 నగదు, ఏడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మెదక్ పట్టణంలోని బ్రాహ్మణ గల్లీకి చెందిన సంగమేశ్వర్రెడ్డి, ఫత్తేనగర్కు చెందిన దొమ్మాట రాజేందర్, రాంనగర్కు చెందిన నడుమూరి మధుబాబు, అజంపురకు చెందిన ముక్కపాటి జయకాంత్, దాయర వీధికి చెందిన శ్రీనివాస్నాయక్ అదుపులోకి తీసుకున్నామన్నారు. ఇదిలావుండగా పట్టుబడిన వారిలో సంగమేశ్వర్రెడ్డి క్రికెట్ బెట్టింగ్కి కూడా పాల్పడుతున్నాడని తమ ప్రాథమిక విచారణలో తేలిందని అన్నారు. అతడిపై పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నామని, తనకు బెట్టింగ్కి సహకరిస్తున్న, బెట్టింగ్కి పాల్పడుతున్న వారిపైన కూడా విచారణ చేస్తామని, ఇలా ఎవరైన అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.