పుణె: ఇంగ్లాండ్తో జరుగుతోన్న చివరిదైన మూడో వన్డేలో భారత్కు శుభారంభం లభించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేస్తున్న టీమ్ఇండియా మంచి రన్రేట్తో దూసుకెళ్తోంది. తొలి 10 ఓవర్లలో 65/0తో నిలిచింది. ఓపెనర్ శిఖర్ ధావన్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడుతూ 44 బంతుల్లోనే 9 ఫోర్ల సాయంతో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. వన్డే క్రికెట్లో అతనికిది 32వ హాఫ్సెంచరీ కావడం విశేసం. రోహిత్(35), ధావన్(53) జోడీని విడదీయాలని ఇంగ్లీష్ బౌలర్లు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం 13 ఓవర్లకు భారత్ వికెట్ నష్టపోకుండా 92 పరుగులు చేసింది.