జోగులాంబ గద్వాల : కాలువ కోతకు గురైందని రైతులు అధైర్య పడవద్దని అండగా ఉంటానని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి రైతులకు భరోసా ఇచ్చారు. గూడెందొడ్డి రిజర్వాయర్ దగ్గర కాలువ కోతకు గురి కాగా ఎమ్మెల్యే పరిశీలించారు. ధరూర్ మండలం పరిధిలోని నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా గూడెందొడ్డి లిప్టు- 1 వద్ద నీటి ప్రవాహానికి గూడెందొడ్డి 99 ప్యాకేజీ రిజర్వాయర్ కాలువ తెగిపోయింది.
విషయం తెలుసుకున్నఎమ్మెల్యే వెంటనే సంఘటనస్థలానికి చేరుకుని కాలువను పరిశీలించారు. కాలువకు వస్తున్న ప్రెషర్ కారణంగా నీళ్లు ఉధృతంగా పారడంతో కాలువకు తెగింది. కాలువ మరమ్మతులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. గేట్లను మూసేందుకు సాగునీటి శాఖ అధికారులు చర్యలు చేపటినట్లు తెలిపారు.
కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రఘురామ్ శర్మ ఎంపీపీ విజయ్, సర్పంచ్ రఘు వర్ధన్ రెడ్డి, టీఆర్ఎస్నాయకులు ప్రభాకర్ గౌడ్, భరత్, ఈశ్వర్, సాగు నీటి ఈఈ రహీముద్దీన్ అధికారులు,తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
యాదాద్రి ఆలయం అత్యద్భుతం : ఏపీ మంత్రి పేర్ని నాని
విమర్శల పాలవుతున్న ప్రగ్యా ఠాకూర్.. ఎందుకంటే.?
పేదలను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యం
సానియా మీర్జా, షోయెబ్ జంటకు యూఏఈ గోల్డెన్ వీసా జారీ