దేవరకద్ర రూరల్, జనవరి 7 : రైతు సంక్షేమ మే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం దేవరకద్ర ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆల హాజరై విజేతలకు మొదటి బ హుమతి రూ.1500, ద్వితీయ బహుమతి రూ.వె య్యి, తృతీయ బహుమతి రూ.500 అందజేశా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడే రైతన్నకు ప్రభుత్వం రైతుబంధు పథకంతో పెట్టుబడి సాయం అందించి అండగా నిలుస్తున్నదన్నారు. రైతులకు నేరుగా సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కిందన్నారు. రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు పంపిణీ చేయడంతోపాటు వ్యవసాయానికి నిరంతర విద్యుత్ సరఫరా, రైతుబీమా తదితర పథకాలతో ప్రభుత్వం రైతులకు తోడ్పాటునందిస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ ర మాదేవి, సర్పంచ్ కొండా విజయలక్ష్మి, రైతుబం ధు సమితి మండల అధ్యక్షుడు కొండారెడ్డి, సింగిల్విండో చైర్మన్ నరేందర్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జెట్టి నర్సింహారెడ్డి, మాజీ అధ్యక్షుడు శ్రీకాంత్యాదవ్, కొండా శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఊరూరా సంబురాలు
మండలంలోని అన్ని గ్రామాల్లో రైతుబంధు వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. డోకూ ర్, లక్ష్మీపల్లి పాఠశాలల్లో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో సింగిల్విండో చైర్మన్ నరేందర్రెడ్డి, సర్పంచులు కృష్ణారెడ్డి, రామకృష్ణారెడ్డి, హెచ్ఎంలు నాగేందర్, విజయకుమార్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
అడ్డాకుల మండలంలో..
మూసాపేట(అడ్డాకుల), జనవరి 7 : అడ్డాకుల మండలంలోని పలు గ్రామాల్లో రైతుబంధు వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. బలీదుపల్లి గ్రామంలో నిర్మించిన చెక్డ్యాంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి జలాభిషేకం చేశారు. అలాగే కందూరు ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వ్యా సరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో జేడీఏ సుచరిత, ఎంపీపీ నాగార్జునరెడ్డి, ఏవో శ్రీనివాసులు, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, సర్పంచ్ శ్రీకాంత్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వేణు, మాజీ ఎంపీపీ దయాకర్, చల్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
భూత్పూర్ మండలంలో..
భూత్పూర్, జనవరి 7 : మండలంలోని వెల్కిచర్ల ఉన్నత పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం, ఉపన్యాస పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు నర్సింహాగౌడ్, సింగిల్విండో చైర్మన్ అశోక్రెడ్డి, సర్పంచ్ పద్మాజక్కిరెడ్డి, ఎంపీటీసీ పద్మాబాలస్వామి, రైతుబంధు సమితి కోఆర్డినేటర్ శ్రీనివాస్గౌడ్, ఏఈవో శంకర్, ఉపసర్పంచ్ గౌస్, మాజీ ఎంపీపీ చంద్రశేఖర్గౌడ్, సత్తూర్ నారాయణగౌడ్, సుదర్శన్గౌడ్, నర్సింహులు పాల్గొన్నారు.
మిడ్జిల్ మండలంలో..
మిడ్జిల్, జనవరి 7 : మండలకేంద్రంతోపాటు బోయిన్పల్లి గ్రామంలో రైతుబంధు వారోత్సవాలు అంబరాన్నంటాయి. రైతుబంధు పథకం ద్వారా ప్రభుత్వం పంటసాగు పెట్టుబడికి రూ.50వేలకోట్లు అందించడంపై హర్షం వ్యక్తంచేస్తూ ప్రజాప్రతినిధులు, నాయకులు రైతులతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అలాగే మిడ్జిల్ పీఏసీసీఎస్ ఆవరణలో మొక్కలు నాటారు. ఉన్నత పాఠశాలలో వి ద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. బోయిన్పల్లిలో మహిళలకు ముగ్గుల పోటీలు ని ర్వహించి బహుమతులు ప్రదానం చేశారు. అలా గే ఉత్తమ రైతు బాలకిష్టారెడ్డిని సన్మానించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్యాంసుందర్రెడ్డి, జెడ్పీటీసీ శశిరేఖ, పీఏసీసీఎస్ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, ఏవో సిద్ధార్థ, సర్పంచులు రాధికారెడ్డి, నారాయణరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షు డు పాండు, నాయకులు దానియేలు, బాలు, గం జి శేఖర్, జగన్గౌడ్, రాఘవేందర్, భద్రయ్య, భా స్కర్నాయక్, తిరుపతినాయక్ పాల్గొన్నారు.
జడ్చర్ల మండలంలో..
జడ్చర్ల రూరల్, జనవరి 7 : మండలంలోని పోలేపల్లి, మాచారం, పెద్ద ఆదిరాల, చిన్నఆదిరాల, కోడ్గల్, కొండేడ్, లింగంపల్లి, గంగాపూర్, బూర్గుపల్లి, నసుర్లాబాద్ తదితర గ్రామాల్లో వి ద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ చేతనారెడ్డి, ఏఈవో శార ద, హెచ్ఎం నాగేంద్రమ్మ, ఎస్ఎంసీ చైర్యన్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
రాజాపూర్ మండలంలో..
రాజాపూర్, జనవరి 7 : మండలకేంద్రంతోపా టు పలు గ్రామాల్లో రైతుబంధు వారోత్సవాలను ఘనంగా జరుపుకొన్నారు. మండలకేంద్రంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, ఎంపీపీ సుశీల, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు నర్సింహులు, జెడ్పీటీసీ మోహన్నాయక్, తాసిల్దార్ శంకర్, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు బచ్చిరెడ్డి,ఎంపీడీవో లక్ష్మీదేవి, ఏవో నరేందర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీశైలంయాదవ్, హెచ్ఎంలు ఆనంద్కుమార్, సుందర్పాల్, ఏపీఎం వెంకటాచారి పాల్గొన్నారు.
బాలానగర్ మండలంలో..
బాలానగర్, జనవరి 7 : మండలంలోని గౌతాపూర్లో ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు కమ్మదనం గోపాల్రెడ్డి మాట్లాడుతూ రైతు ను రాజు చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారన్నారు. కార్యక్రమంలో సర్పం చ్ రమేశ్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.