నల్లగొండ : రైతులకు వ్యవసాయ సాగు పద్ధతులు, విజ్ఞానాన్ని పెంచేందుకు రైతు వేదికలు పాఠశాలలుగా ఉపయోగ పడతాయని విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి అన్నారు. బుధవారం త్రిపురారం మండలం, నిడమనూర్, హాలియా మండలంలో రైతు వేదికలు ప్రారంభించారు. త్రిపురారం మండలంలో పెద్దదేవుల పల్లి, త్రిపురారం, నిడమనూర్ మండలం ఇండ్ల కోటయ్య గూడెం, ముప్పారం, నిడమనూర్ గ్రామ వ్యవసాయ క్లస్టర్ లలో రైతు వేదికలు మంత్రి ప్రారంభించారు. ముప్పారం గ్రామంలో జరిగిన సమావేశంలో రైతులతో మంత్రి చర్చిస్తూ పంటల సాగు, పెట్టుబడి,ఆదాయం గురించి అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మత్రి మాట్లాడుతూ.. రైతులు తమ అనుభవాలు, కష్టాలు, ఏ పంటలు సాగు చేయాలి, మార్కెటింగ్ సౌకర్యాలు గురించి ఒక చోట చర్చించుకొనేందుకు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ రైతు వేదికలు నిర్మించారని అన్నారు. రాష్ట్రం రాక ముందు రైతుల గురించి ఎవరూ పట్టించుకోలేదని, మొసలి కన్నీళ్లు కార్చారని మంత్రి తెలిపారు. యాసంగి సీజన్లో రాష్ట్రంలో 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేసి ఎఫ్.సి.ఐ కి అందించినట్లు, ఉమ్మడి నల్గొండ జిల్లాలో 19 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్య సేకరణ చేసినట్లు తెలిపారు.
యాసంగి, వానాకాలం గత సంవత్సరం 40 లక్షల మెట్రిక్ టన్ను ల ధాన్యం ఎఫ్.సి.ఐ కి,20 లక్షల మెట్రిక్ టన్నుల మిల్లులుకు, మొత్తం 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి నల్గొండ ఉమ్మడి జిల్లా రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచిందని వెల్లడించారు. రైతులు లాభసాటి వ్యవసాయంతో ఆదాయం పెంచు కోవాలన్నదే ముఖ్యమంత్రి ధ్యేయం అని అన్నారు. అలాగే ముప్పారంలో శివాలయం నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు.
అనుముల మండలం హజారి గూడెం లో చెక్ డ్యాం నిర్మాణానికి శంకు స్థాపన చేశారు. మంత్రి వెంట స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, నాగార్జున సాగర్ శాసన సభ్యుడు నోముల భగత్, రైతు బంధు సమితి అధ్యక్షుడు రాంచంద్ర నాయక్, వ్యవసాయ శాఖ జె.డి.శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
పారిశుధ్య పనులను పరిశీలించిన మంత్రి పువ్వాడ
జమ్మికుంటలో పెండింగ్ పనులు పూర్తి చేయాలి
‘విద్యార్థుల హాజరుపై మూడు రోజుల్లో విధివిధానాలు ఖరారు’
అందరి సహకారంతో గ్రామాల అభివృద్ధి
పరిగిని సుందరంగా తీర్చిదిద్దుదాం
మంత్రి ఎర్రబెల్లిని కలిసిన వీసీ సీతారామారావు
తెలంగాణ.. రైతు సంక్షేమ రాష్ట్రం : మంత్రి పువ్వాడ