కరీంనగర్ : రానున్న రోజుల్లో రైతు వేదికలు సాగు విజ్ఞాన కేంద్రాలుగా మారతాయని బీసీ సంక్షేమం, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. గురువారం కరీంనగర్ రూరల్ మండలం ముగ్ధుంపూర్లో తన సొంత ఖర్చులతో నిర్మించిన రైతు వేదిక భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు బాధలు తెలిసిన సీఎం కేసీఆర్ వారి కోసం ఇలాంటి వినూత్న కార్యక్రమాలను చేపడుతున్నారని అన్నారు.
ఒక నాడు కచేరీల వద్ద చేరి తమ సాదకబాధకాలు మాట్లాడుకునే రైతులు ఇప్పుడు దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు వేదికల్లో మాట్లాడుకుంటున్నారని తెలిపారు. తన అన్న గంగుల ప్రభాకర్ జ్ఞాపకార్థం కొత్తపల్లి మండలం బద్దిపల్లితోపాటు ముగ్ధుంపూర్లో తన సొంత ఖర్చులతో రెండు రైతు వేదికలు నిర్మించానని, ఇందుకు సహకరించిన స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
అతి త్వరలో కరోనా వైరస్ నుంచి బయటపడతామని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. అంతకు ముందు చెర్లభూత్కూర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి రైతులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా కొనుగోళ్లు జరిపే బాధ్యత సీఎం కేసీఆర్ తీసుకున్నారని చెప్పారు.
ఈసారి దిగుబడులు గణనీయంగా పెరుగుతాయని, ఎంత దిగుబడి మార్కెట్కు వచ్చినా కొనేందుకు ఊరూరా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమాల్లో కలెక్టర్ శశాంక, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరుల పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
అటవీ శాఖ ఉద్యోగులు విధిగా వ్యాక్సిన్ వేసుకోవాలి
తెలంగాణలో టీడీపీకి స్థానం లేదు : మంత్రి హరీశ్రావు
శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై కారు బోల్తా..
రాజన్న ఆలయంలో భక్తుల దర్శనానికి అనుమతి రద్దు
ఐదేండ్ల తర్వాత హాఫ్సెంచరీ చేసిన స్టార్ ఆల్రౌండర్