వ్యవసాయ పెట్టుబడికి ఒకప్పుడు అప్పుల కోసం రైతులు పడే పాట్లు అన్నీఇన్నీ కావు. ఆరుగాలం కష్టించి సాగు చేసినా పంటల దిగుబడి రాకపోయేది. అప్పులు తీరే దారి లేక ఆత్మహత్య బాట పట్టేవారు. రైతాంగం దుస్థితిని గ్రహించిన సీఎం కేసీఆర్ పంట పెట్టుబడి సమస్యలను తీర్చేందుకు రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చారు. మూడేండ్లుగా ప్రభుత్వం అందిస్తున్న సాయంతో రైతులు ఆర్థికంగా నిలదొక్కుకుంటూ పంటలు పండిస్తున్నారు.
పడావు పడిన భూములు సాగులోకి…
ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల నుంచి కరెంటు, నీళ్లు, ప్రోత్సాహకాలు లేకపోవటంతో భూములను పడావు పెట్టి వలస వెళ్లిన ఘటనలు కోకొల్లలు. నాగార్జునసాగర్ నుంచి కేటాయింపుల ప్రకారం నీరు ఇవ్వకపోవడంతో వ్యవసాయానికి రైతులు దూరమయ్యారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత వీటిలో మార్పు వచ్చింది. తొలి ఏడాదే సాగర్ నుంచి నీటిని అందించి యంత్రలక్ష్మి పేరుతో యంత్రాలు, సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు ఇచ్చారు. ఆ తర్వాత పంట పెట్టుబడికి రైతు బంధు సాయం, రైతుబీమా తదితర రైతు సంక్షేమ పథకాలు ప్రారంభించారు. దీంతో వలసవెళ్లిన రైతులు సొంతూళ్లకు వచ్చి పండుగలా వ్యవసాయం చేసుకుంటున్నారు.
అత్యధికంగా సాగర్ నియోజకవర్గంలోనే..
నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి మన జిల్లాకు నీటి వాటా పూర్తి స్థాయిలో రావటంతో బీడు భూములు సాగులోకి వచ్చాయి. దీంతో నాగార్జున సాగర్ నియోజకవర్గంలోనే ఎక్కువ రైతుబంధు పొందుతున్న అన్నదాతలు ఉన్నారు. జిల్లాలో ఆరు నియోజకవర్గాలకు రూ.611 కోట్లు ప్రతి సీజన్లో ప్రభుత్వం చెల్లిస్తుండగా అందులో రూ.127.34 కోట్లు (21శాతం) నాగార్జున సాగర్ రైతాంగానికే అందుతున్నది. మొత్తం 97,399 మంది రైతులకు ఈ సాయం వస్తున్నది. ఈ నియోజకవర్గంలో అత్యధికంగా గుర్రంపోడు రైతులకు రూ. 31.52 కోట్ల రైతు బంధు అందుతున్నది.
మూడేండ్లలో రూ.3,420 కోట్లు
ఎన్నికల హామీ కాకపోయినా..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతియేటా బడ్జెట్లో రూ.12వేల కోట్లు కేటాయించి రైతులకు ప్రతి సీజన్లోనూ పెట్టుబడి సాయం అందజేస్తున్నది. ఈ పథకం ఎన్నికల హామీలో లేకపోయినా రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా దీన్ని ప్రారంభించి అమలు చేస్తున్నారు. పంట సాయం అందుకున్న రైతులు అప్పులు లేకుండా ప్రశాంతంగా పంటలు సాగు చేస్తున్నారు. సర్కారు అండగాసాగు పండుగ
వ్యవసాయ పెట్టుబడికి ఒకప్పుడు అప్పుల కోసంరైతులు పడే పాట్లు అన్నీఇన్నీ కావు. ఆరుగాలం కష్టించి సాగు చేసినా పంటల దిగుబడి రాకపోయేది. అప్పులుతీరే దారి లేక ఆత్మహత్య బాట పట్టేవారు. రైతాంగం దుస్థితిని గ్రహించిన సీఎం కేసీఆర్ పంట పెట్టుబడి సమస్యలను తీర్చేందుకు రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చారు. మూడేండ్లుగా ప్రభుత్వం అందిస్తున్న సాయంతో రైతులు ఆర్థికంగా నిలదొక్కుకుంటూ పంటలు పండిస్తున్నారు.
పడావు పడిన భూములు సాగులోకి…
ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల నుంచి కరెంటు, నీళ్లు, ప్రోత్సాహకాలు లేకపోవటంతో భూములను పడావు పెట్టి వలస వెళ్లిన ఘటనలు కోకొల్లలు. నాగార్జునసాగర్ నుంచి కేటాయింపుల ప్రకారం నీరు ఇవ్వకపోవడంతో వ్యవసాయానికి రైతులు దూరమయ్యారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత వీటిలో మార్పు వచ్చింది. తొలి ఏడాదే సాగర్ నుంచి నీటిని అందించి యంత్రలక్ష్మి పేరుతో యంత్రాలు, సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు ఇచ్చారు. ఆ తర్వాత పంట పెట్టుబడికి రైతు బంధు సాయం, రైతుబీమా తదితర రైతు సంక్షేమ పథకాలు ప్రారంభించారు. దీంతో వలసవెళ్లిన రైతులు సొంతూళ్లకు వచ్చి పండుగలా వ్యవసాయం చేసుకుంటున్నారు.
అత్యధికంగా సాగర్ నియోజకవర్గంలోనే..
నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి మన జిల్లాకు నీటి వాటా పూర్తి స్థాయిలో రావటంతో బీడు భూములు సాగులోకి వచ్చాయి. దీంతో నాగార్జున సాగర్ నియోజకవర్గంలోనే ఎక్కువ రైతుబంధు పొందుతున్న అన్నదాతలు ఉన్నారు. జిల్లాలో ఆరు నియోజకవర్గాలకు రూ.611 కోట్లు ప్రతి సీజన్లో ప్రభుత్వం చెల్లిస్తుండగా అందులో రూ.127.34 కోట్లు (21శాతం) నాగార్జున సాగర్ రైతాంగానికే అందుతున్నది. మొత్తం 97,399 మంది రైతులకు ఈ సాయం వస్తున్నది. ఈ నియోజకవర్గంలో అత్యధికంగా గుర్రంపోడు రైతులకు రూ. 31.52 కోట్ల రైతు బంధు అందుతున్నది.
మూడేండ్లలో రూ.3,420 కోట్లు
ఎన్నికల హామీ కాకపోయినా..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతియేటా బడ్జెట్లో రూ.12వేల కోట్లు కేటాయించి రైతులకు ప్రతి సీజన్లోనూ పెట్టుబడి సాయం అందజేస్తున్నది. ఈ పథకం ఎన్నికల హామీలో లేకపోయినా రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా దీన్ని ప్రారంభించి అమలు చేస్తున్నారు. పంట సాయం అందుకున్న రైతులు అప్పులు లేకుండా ప్రశాంతంగా పంటలు సాగు చేస్తున్నారు. సర్కారు అండగాసాగు పండుగ
పడావు పడిన భూములు సాగులోకి…
ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల నుంచి కరెంటు, నీళ్లు, ప్రోత్సాహకాలు లేకపోవటంతో భూములను పడావు పెట్టి వలస వెళ్లిన ఘటనలు కోకొల్లలు. నాగార్జునసాగర్ నుంచి కేటాయింపుల ప్రకారం నీరు ఇవ్వకపోవడంతో వ్యవసాయానికి రైతులు దూరమయ్యారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత వీటిలో మార్పు వచ్చింది. తొలి ఏడాదే సాగర్ నుంచి నీటిని అందించి యంత్రలక్ష్మి పేరుతో యంత్రాలు, సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు ఇచ్చారు. ఆ తర్వాత పంట పెట్టుబడికి రైతు బంధు సాయం, రైతుబీమా తదితర రైతు సంక్షేమ పథకాలు ప్రారంభించారు. దీంతో వలసవెళ్లిన రైతులు సొంతూళ్లకు వచ్చి పండుగలా వ్యవసాయం చేసుకుంటున్నారు.
అత్యధికంగా సాగర్ నియోజకవర్గంలోనే..
నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి మన జిల్లాకు నీటి వాటా పూర్తి స్థాయిలో రావటంతో బీడు భూములు సాగులోకి వచ్చాయి. దీంతో నాగార్జున సాగర్ నియోజకవర్గంలోనే ఎక్కువ రైతుబంధు పొందుతున్న అన్నదాతలు ఉన్నారు. జిల్లాలో ఆరు నియోజకవర్గాలకు రూ.611 కోట్లు ప్రతి సీజన్లో ప్రభుత్వం చెల్లిస్తుండగా అందులో రూ.127.34 కోట్లు (21శాతం) నాగార్జున సాగర్ రైతాంగానికే అందుతున్నది. మొత్తం 97,399 మంది రైతులకు ఈ సాయం వస్తున్నది. ఈ నియోజకవర్గంలో అత్యధికంగా గుర్రంపోడు రైతులకు రూ. 31.52 కోట్ల రైతు బంధు అందుతున్నది.
మూడేండ్లలో రూ.3,420 కోట్లు
ఎన్నికల హామీ కాకపోయినా..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతియేటా బడ్జెట్లో రూ.12వేల కోట్లు కేటాయించి రైతులకు ప్రతి సీజన్లోనూ పెట్టుబడి సాయం అందజేస్తున్నది. ఈ పథకం ఎన్నికల హామీలో లేకపోయినా రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా దీన్ని ప్రారంభించి అమలు చేస్తున్నారు. పంట సాయం అందుకున్న రైతులు అప్పులు లేకుండా ప్రశాంతంగా పంటలు సాగు చేస్తున్నారు.
పెట్టుబడి సాయం నిలబెట్టింది
నిడమనూరు మండలంలోని వేంపాడుకు చెందిన రాగం రామలింగయ్యకు రెండెకరాల వ్యవసాయ భూమి ఉంది. ఏండ్ల తరబడి మెట్ట పంటలు సాగు చేసినా తెగుళ్ల బెడద, ఇతర కారణాలతో దిగుబడి రాక అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. ప్రభుత్వం పెట్టుబడి సాయం అందిస్తుండడంతో కొంత ఊరట చెందాడు. నేడు పండుగలా పంటలు పండిస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాడు.
రైతులకు మేలు చేసే ప్రభుత్వం
మాకు 10 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. రైతుబంధు పథకం లేనప్పుడు పంట పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారుల వద్దకు పోవాల్సి వచ్చేది. ఇదే అదునుగా నూటికి 5 రూపాయలు వడ్డీ తీసుకొని అప్పు ఇచ్చేవారు. పండించిన పంట వడ్డీకే సరిపోయేది. ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప మనసుతో పంట పెట్టుబడి సాయం చేస్తున్నారు.మాకు ఇప్పటివరకు నాలుగు లక్షలు వచ్చాయి. రైతు సంక్షేమానికి ఇంతకన్నా మేలు చేసే ప్రభుత్వం ఈ దేశంలోనే లేదు.
రైతుల పాలిట దేవుడు కేసీఆర్
నాకు ఎకరం మూడు గుంటల భూమి ఉంది. పోలియో కారణంగా నా రెండు కాళ్లు పనిచేయవు. పంట పెట్టుబడికి ఇంతకుముందు ఇబ్బంది పడేవాళ్లం. ఇప్పుడొస్తున్న రైతుబంధు సాయం శానా ఉపయోగపడుతున్నది. నాకు దివ్యాంగుల పింఛన్ కూడా వస్తున్నది. రైతుల పాలిట దేవుడు కేసీఆర్.
-పానుగోతు రవికుమార్, కుంకుడుచెట్టుతండా, త్రిపురారం
ఇవీ కూడా చదవండి..
పైలట్పై పిల్లి దాడి.. విమానం అత్యవసర లాండింగ్
గిలానీ షాకింగ్ విక్టరీ.. విశ్వాస పరీక్షకు ఇమ్రాన్ ఖాన్
బ్రెజిల్లో ఒక్కరోజే 1641 కరోనా మరణాలు