రంగారెడ్డి : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శంషాబాద్లో కారును లారీ ఢీకొన్న సంఘటనలో ఆరుగురు ఇటుకబట్టీ కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 15 మంది గాయపడ్డారు. లారీ కింద ఆరుగురు కూరగాయల వ్యాపారులు చిక్కుకున్నారు. ప్రమాద సమయంలో 30 పైగా కార్మికులు ఉన్నారు.
క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప దవాఖానకు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లారీ శంషాబాద్ నుంచి షాద్నగర్కు వెళ్తుండగా నర్కుడ గ్రామం వద్ద ప్రమాదానికి గురై బోల్తా పడింది. వారాంతపు సంతకు వెళ్లి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సంఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
ఉచిత విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ
గాలి ద్వారా కరోనా చాలా ఆందోళనకరం: ఎయిమ్స్ చీఫ్
పెద్దపల్లి జిల్లాలో..కరోనాతో అటెండర్ మృతి
భారీగా నిషేధిత గుట్కా ప్యాకెట్ల పట్టివేత