ముంబై : మహారాష్ర్ట రాజధాని ముంబైలోని బాంద్ర కుర్లా కాంప్లెక్స్ వద్ద దారుణం జరిగింది. ఓ మహిళ మృతదేహాన్ని స్థానికంగా ఉన్న డ్రైనేజీలో పడేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మహిళపై అత్యాచారం చేసి, ఆ తర్వాత గొంతు కోసి చంపినట్లు పోలీసులు నిర్ధారించారు. మృతురాలి ప్రయివేటు భాగాల్లో కూడా గాయాలు అయినట్లు తేలింది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఆమె వృత్తిరీత్యా వ్యభిచారిణి అని తెలిసింది. విటులకు, ఆమెకు మధ్య డబ్బుల విషయంలోనే గొడవ జరిగి ఉండొచ్చు అని పోలీసులు పేర్కొన్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.