హైదరాబాద్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( TSPSC ) సెక్రటరీగా సేవలందించిన ఐఏఎస్ ఆఫీసర్ వాణి ప్రసాద్కు ఘనంగా వీడ్కోలు పలికారు. ఐఏఎస్ ఆఫీసర్ అనితా రామచంద్రన్ నిన్న టీఎస్పీఎస్సీ సెక్రటరీగా పదవీ బాధ్యతలు స్వీకరించిన విషయం విదితమే. ఈ క్రమంలో వాణి ప్రసాద్కు గురువారం టీఎస్పీఎస్సీ చైర్మన్ బీ జనార్ధన్ రెడ్డి, సభ్యులు సీహెచ్ సాయిలు, బీ లింగారెడ్డి, కోట్ల అరుణ కుమారి, సుమిత్రా ఆనంద్ తనోబా, కారం రవీందర్ రెడ్డి, అరవెల్లి చంద్రశేఖర్ రావు, ఆర్ సత్యనారాయణ, సెక్రటరీ అనితా రామచంద్రన్ వీడ్కోలు పలికారు.