నిజామాబాద్ : కరోనా సోకిన వ్యక్తిని సొంత కుటుంబ సభ్యులే ఇంట్లోకి రానివ్వకుండా గ్రామంలోని ఓ చెట్టుకిందే ఉంచారు. ఈ సంఘటన ఇందల్వాయి మండలంలోని సామ్యనాయక్ తండాలో చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న తహసీల్దార్ రమేశ్ శుక్రవారం అక్కడకు చేరుకుని కరోనా బాధితుడి కుటుంబ సభ్యులను పిలిచించి మాట్లాడారు.
కరోనా సోకిన వ్యక్తిని దూరంగా ఉంచడం సరైంది కాదని, ప్రజలు ఆయనకు అండగా ఉండి ధైర్యం చెప్పాలని సూచించారు. కరోనాతో ఎవరూ అధైర్యపడవద్దని, ప్రతిఒక్కరూ మాస్కు, సామాజిక దూరం పాటించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం కొవిడ్ బాధితులకు అండగా నిలుస్తున్నదని తెలిపారు. ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని తెలిపారు. బాధితుల్లో ఆత్మస్థెర్యం నింపాలన్నారు. అనంతరం బాధితుడిని కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకెళ్లారు.
ఇవి కూడా చదవండి..
షాపు తెరిచినందుకు రూ.3 వేల జరిమానా
అనంతగిరిలో కొవిడ్ హాస్పిటల్ను ఏర్పాటు చేస్తాం
రోడ్డు వెడల్పు పనులను పరిశీలించిన మంత్రి అల్లోల
బావిలోంచి బాలుడి మృతదేహం వెలికితీత
సుందర్ లాల్ బహుగుణ మృతి పట్ల మంత్రి ఐకే రెడ్డి సంతాపం