రాజస్థాన్ భరత్పూర్ సైబర్నేరగాళ్ల నిర్వాకం
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ పేరుతో సైబర్ నేరగాళ్లు నకిలీ ఫేస్బుక్ ఖాతాను తయారుచేశారు. దీనిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదుచేయడంతో కేసు నమోదుచేశారు. ఏసీపీ కేవీఎం ప్రసాద్ కథనం ప్రకారం.. ఎంపీ పేరు, ఫొటోతో కొత్తగా ఫేస్బుక్ ఖాతాను తెరిచారు. ఆ ఖాతాలో ఆయన సర్కిల్లో ఉన్న వారిని యాడ్ చేసి అర్జెంట్గా డబ్బు అవసరమున్నదంటూ మేసేజ్లు పెట్టారు. దీన్ని గుర్తించిన ఎంపీ వెంటనే తమకు ఫిర్యాదు చేశారని ఏసీపీ తెలిపారు. రాజస్థాన్ భరత్పూర్కు చెందిన సైబర్ ముఠాలు ప్రముఖుల ఫొటోలు, పేర్లతో నకిలీ ఫేస్బుక్ ఖాతాలు తెరుస్తున్నారని చెప్పారు. నకిలీ ఖాతాను తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఫేస్బుక్లో అర్జెంట్గా డబ్బులు అవసరమున్నాయని ఎవరైనా పోస్టులు పెడితే వాటిని నమ్మొద్దని ఏసీపీ సూచించారు.