న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న తరుణ్ బజాజ్.. రెవెన్యూశాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు.
ఈ మేరకు కేబినెట్ నియామక కమిటీ మంగళవారం తరుణ్ బజాజ్ నియామకానికి ఆమోదముద్ర వేసింది.
ఆయన స్థానంలో ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శిగా అజయ్ సేతును నియమిస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వశాఖ వెల్లడించింది.
2020, మే 1వ తేదీన తరుణ్ బజాజ్ ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఈ స్థానంలో కొనసాగిన అథాను చక్రవర్తి పదవీకాలం గతేడాది ఏప్రిల్ 30న ముగిసింది.
తరుణ్ బజాబ్ హర్యానా క్యాడర్కు చెందన ఐఏఎస్ అధికారి. గతంలో ఆయన ప్రధాన మంత్రి కార్యాలయం అదనపు కార్యదర్శిగానూ బాధ్యతలు నిర్వర్తించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి