హైదరాబాద్: దసరా, బతుకమ్మ పండుగల ప్రయాణాల కారణంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో విపరీతమైన ట్రాఫిక్ జామ్ అయింది. చౌటుప్పల్ వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. చౌటుప్పల్ నుంచి కొయ్యలగూడెం వరకూ ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.
ఇక్కడ ట్రాఫిక్ జామ్ కారణంగా సుమారు 4 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పండుగ ప్రయాణాల వల్లే ఈ స్థాయిలో ట్రాఫిక్ జామ్ అయినట్లు తెలుస్తోంది. ఇంతలా ట్రాఫిక్ జామ్ అవడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకుపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.