నీలగిరి/ మిర్యాలగూడ టౌన్/ త్రిపురారం, జూన్ 12 : నిషేధిత ఉత్పత్తులను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్రెడ్డి హెచ్చరించారు. శనివారం పట్టణంలోని ప్రకాశంబజార్లో పోలా లక్ష్మీనర్సయ్య దుకాణంలో సుమారు లక్షన్నర విలువైన పొగాకు ఉత్పత్తులను వన్టౌన్ సీఐ నిగిడాల సురేశ్ ఆధ్వర్యంలో సీజ్ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ నిషేధిత ఉత్పత్తులపై నిరంతరం నిఘా ఉంటుందన్నారు. ఎక్కడైనా విక్రయాలు జరిగితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. 9వేల గుట్కా ప్యాకెట్లు, 168 టోబాకో, 30ఎస్ఆర్-1 టోబాకో, 120బాబా ప్యాకెట్లతోపాటు మరో 16రకాల ఉత్పత్తులను సీజ్ చేసినట్లు తెలిపారు. దుకాణం యజమానిపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపినట్లు తెలిపారు. మిర్యాలగూడ పట్టణంలోని పలు కిరాణ, పాన్షాపుల్లో విక్రయిస్తున్న రూ. 50వేల గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు వన్టౌన్ సీఐ సదానాగరాజు తెలిపారు. ఏడుగురిపై కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. ఆయన వెంట ఎస్ఐ అంతిరెడ్డి, సిబ్బంది ఉన్నారు. త్రిపురారం మండలంలోని పలు కిరాణ, పాన్ దుకాణాలు తనిఖీ చేసి రూ.5 వేల గుట్కా ప్యాకెట్లను పట్టుకున్నట్లు ఎస్ఐ రామమూర్తి తెలిపారు. దుకాణాదారుడు మస్తాన్వలీపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.