అమరావతి : కొవిడ్ బాధితుల నుంచి అధిక బిల్లులు వసూలు చేసే దవాఖాన యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ హెచ్చరించారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరల కంటే ఎక్కవ వసూలు చేస్తే చర్యలు తప్పవని అన్నారు. రాష్ట్రంలోని ప్రైవేట్ దవాఖానల్లో వైద్యం అమలు తీరు, బిల్లుల వసూలు అంశంపై వైద్య ఆరోగ్యశాఖ నిరంతరం నిఘా పెడుతుందని తెలిపారు.
కొన్ని చోట్ల కొవిడ్ బాధితుల నుంచి భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్న దవాఖానలకు భారీగా జరిమానాలు విధిస్తున్నామని చెప్పారు. ప్రైవేట్ దవాఖానల నిర్వాహకులు మానవతావాదంతో వ్యవహరించాలని సూచించారు. విపత్కర పరిస్థితుల్లో బాధితులకు మెరుగైన వైద్యం అందించి సహకరించాలని కోరారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.