హైదరాబాద్ : రాష్ట్రంలోని జనరల్ గురుకుల కళాశాలల్లో 2021-22 విద్యాసంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి ఏడాదిలో ప్రవేశానికి దరఖాస్తు గడువు ఈ నెల 19 వరకు పొడిగించినట్లు గురుకులాల సొసైటీ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. వివిధ కోర్సుల్లో చేరేందుకు ఆసక్తిగల అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. మరిన్ని వివరాలకు గురుకుల సొసైటీ వెబ్సైట్ను సందర్శించాలని ఆయన పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.