హైదరాబాద్ : కరోనా బారిన పడిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ రెండో సారి కరోనాను జయించారు. వైరస్ బారి నుంచి కోలుకున్నారు. గత నెల 30వ తేదీన జరిపిన కొవిడ్ టెస్టులో పాజిటివ్ వచ్చిందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్వయంగా సోషల్ మీడియా, ట్విట్టర్ ద్వారా స్వయంగా తెలిపారు.
రెండో సారి వైరస్ బారిన పడినప్పటి నుంచి హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ నందు పూర్తిగా హోం ఐసోలేషన్లో ఉంటూ చికిత్స తీసుకున్నారు. వైద్యుల సలహాలు సూచనలు తీసుకుని క్రమం తప్పకుండా పాటించారు. తాజాగా నేడు జరిపిన కొవిడ్ పరీక్షలో మంత్రి పువ్వాడకు నెగెటివ్ రిపోర్ట్ వచ్చిందని వారు ప్రకటించారు.
మంత్రికి కరోనా నెగెటివ్ అనే విషయం తెల్వగానే ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కరోనా మహమ్మారిని జయించడానికి నాకు ధైర్యం ఇచ్చింది పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులే అని సోమవారం నుంచి తిరిగి విధులకు హాజరుకానున్నట్లు మంత్రి పువ్వాడ ప్రకటించారు.
ఇవి కూడా చదవండి..
వనపర్తి రోడ్డు ప్రమాదంలో మరొకరి మృతి
Mothers Day : అమ్మ ఆరోగ్యం కోసం కూతురు పోరాటం
మంత్రి కొప్పుల ఈశ్వర్కు కరోనా పాజిటివ్
భారీగా నల్ల బెల్లం, పటిక పట్టివేత