కరీంనగర్ : దళిత బంధు పథకాన్ని వ్యతిరేకించే వారిని తరిమికొట్టండని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పిలుపునిచ్చారు. ఇల్లందకుంట మండలం పాతర్లపాడు గ్రామంలో ప్రజలతో మండల ఇంచార్జి, ఎమ్మెల్యే రవిశంకర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దళిత బంధు పథకాన్ని అడ్డుకునే వారిని తరిమి కొట్టే సమయం ఆసన్నమైందన్నారు. ప్రతిపక్షాలు వారి చిల్లర రాజకీయాల కోసం దళితులను మభ్యపెడుతున్నారని విమర్శించారు.
నేను ఎస్సీ సెల్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ నాతో పాటు మంత్రి కొప్పుల ఈశ్వర్, దళిత ప్రజా ప్రతినిధులను పిలిచి మాట్లాడారు. దళితులకు ఏదైనా పథకం రూపొందించాలని, వారు శాశ్వతంగా వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలిచిపోయే విధంగా పథకం రూపొందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. గత మూడు సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకం గురించి రూపకల్పన చేశారు. అనేక సమీక్ష సమావేశాలు నిర్వహించారు.
దళిత బంధు పథకం అనేది హుజరాబాద్ ఉప ఎన్నికల కోసం వచ్చింది కాదన్నారు. గత బడ్జెట్ సమావేశాల్లో దళిత ఎంపవర్మెంట్ స్కీం కి వెయ్యి కోట్లు ప్రవేశపెట్టారు. దళిత ఎంపవర్మెంట్ స్కీమే దళిత బంధు పథకం అన్నారు. అలాగే సీఎం అడగకముందే రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంటు, కేసీఆర్ కిట్, కల్యాణ లక్ష్మి వంటి పథకాలను అమలు చేస్తున్నారు. ఈ పథకాలన్నీ ప్రతిపక్ష నాయకులకు కనబడడం లేదా అని ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి..
ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, అత్యాచారయత్నం కేసు
దారుణం : రైల్వే ట్రాక్పై యువతి మృతదేహం
Road accident |బొలెరో వాహనం బోల్తా..పది మందికి గాయాలు