వనపర్తి టౌన్, మే 25 : కొవిడ్ నేపథ్యంలో పాఠశాల లు, కళాశాలలు మూతపడడంతో ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి తెలంగాణ ప్రభు త్వం రెండు మాసాలుగా ఒక్కొక్కరికీ 25కేజీల బి య్యాన్ని, రూ.2వేల నగదును అందజేస్తుంది. జిల్లావ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది 2,718 మంది లబ్ధి చేకూరుతు ంది. జిల్లాలో 151 పాఠశాలలకు గానూ 1,921 మం ది బోధన సిబ్బంది, 797 మంది బోధనేతర సిబ్బం ది ఉన్నారు. మొదటి విడుతలో 1,366 మందికి అం దజేయగా, కొంతమంది అకౌంట్ ట్యాలీ, ఇతర సమస్యల వల్ల 25కేజీల బియ్యం, రూ.2వేల నగదును ఇవ్వలేకపోయినప్పటికీ సోమవారం రెండో విడుతలో రెండు మాసాలకు కలిపి 50కేజీల బియ్యం, నగదు అందజేశారు.
మండలాలవారీగా ఇలా..
జిల్లాలో ఆయా మండలాల వారీగా 151 పాఠశాలల నుంచి గుర్తించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అమరచింత మండలంలోని 4 ప్రైవేట్ పాఠశాలలకు గాను 39 బోధన సిబ్బంది, 16 మంది బోధనేతర సిబ్బంది మొత్తం 58 మంది, మదనాపురంలో 4 పాఠశాలలకు గానూ 24 మంది బోధన సిబ్బంది, ఆరుగురు బోధనేతర సిబ్బంది మొత్తం 30 మంది, పెద్దమందడిలో 8 పాఠశాలలకు గానూ 55 మంది బోధన సిబ్బంది, 25 మంది బోధనేతర సిబ్బంది మొత్తం 80 మంది, ఖిల్లాఘణపురంలో 5 పాఠశాలలకు గానూ 63 మంది బోధన, 26 మంది బోధనేతర మొత్తం 89 మంది, గోపాల్పేటలో 7 పాఠశాలలకుగానూ 48 మంది బోధన, 16 బోధనేతర సిబ్బం ది మొత్తం 64 మంది, రేవల్లిలో 2 పాఠశాలలకు గా నూ 21 మంది బోధన, 15 మంది బోధనేతర సి బ్బంది మొత్తం 36 మంది, పాన్గల్లో 8 పాఠశాలలకు గానూ 75 మంది బోధన, 23 మంది బోధనేతర సిబ్బంది మొత్తం 98 మంది, వనపర్తిలో 51 పా ఠశాలలకు గానూ 797 మంది బోధన, 296 మంది బోధనేతర సిబ్బంది మొత్తం 1093 మంది, కొత్తకోటలో 20 పాఠశాలలకు గానూ 289 మంది బోధన, 153 మంది బోధనేతర సిబ్బంది మొత్తం 442 మం ది, ఆత్మకూర్లో 11 పాఠశాలలకు గాను 204 మంది బోధన, 129 బోధనేతర సిబ్బంది మొత్తం 333 మంది, పెబ్బేర్లో 11 పాఠశాలలకు గానూ 219 బో ధన, 64 మంది బోధనేతర సిబ్బంది మొత్తం 283 మంది, శ్రీరంగాపురంలో 4 పాఠశాలలకు గానూ 34 మంది బోధన, 10 బోధనేతర సిబ్బంది మొత్తం 44 మంది, వీపనగండ్ల 3 పాఠశాలలకు గానూ 18 బోధ న, 5 మంది బోధనేతర సిబ్బంది మొత్తం 23 మం ది, చిన్నంబావిలో 4 పాఠశాలలకు గానూ 35 మంది బోధన, 13 మంది బోధనేతర సిబ్బంది మొత్తం 48 మంది జిల్లావ్యాప్తంగా 151 పాఠశాలలకు 1921 మంది బోధన సిబ్బంది, 797 బోధనేతర సిబ్బందిని ప్రభుత్వం కరోనా లాక్డౌన్లో ఆదుకుంటుంది.