ప్రధానమంత్రి నరేంద్రమోదీ
ఆసిఫాబాద్, మార్చి 22 : ప్రతి వర్షపు చుక్కనూ నిల్వ చేసి భూగర్భ జలాలను పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కంకణబద్ధులు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ జల వనరుల దినోత్సవా న్ని పురస్కరించుకొని సోమవారం పీఎం మోదీ అన్ని రా ష్ర్టాల కలెక్టర్లు, డీఆర్డీవోలు, సంబంధిత అధికారులు, స ర్పంచ్లతో ఆన్లైన్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూమిపై పడే ప్రతి నీటి బొట్టూ వృథాగా పోకుండా నిల్వ చేసేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు. జలశక్తి అభియాన్ ద్వారా నిధులను వెచ్చించి ఇంకుడు గుంతలు, కందకాలు ఏర్పాటుచేయాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో భూగర్భ జలాలను పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని కోరారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో కలెక్టర్ రాహుల్రాజ్ పలువురు అధికారులతో జల ప్రతిజ్ఞ చేయించారు. సమావేశంలో జడ్పీ సీఈవో సాయాగౌడ్, జిల్లా పంచాయతీ అధికారి రమేశ్ పాల్గొన్నారు.