కాన్పూర్: ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఆక్సిజన్ సిలిండర్ పేలింది. దీంతో ఒకరు మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం ఉదయం కాన్పూర్లోని దాదా నగర్ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న పన్కీ ఆక్సిజన్ ప్లాంట్లోని సిలిండర్లో ప్రాణవాయువును నింపుతున్నారు. ఈ క్రమంలో అది ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో ఓ వ్యక్తి, ఇద్దరు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..