హైదరాబాద్ : కరోనా మహమ్మారి నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిలో రాజకీయాలకు అతీతంగా అందరు భాగస్వాములు కావాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విజ్ఞప్తి చేశారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని ప్రజాప్రతినిధులు, అధికారులతో గురువారం మంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం కృషితో కరోనా కేసులు రోజు రోజుకు తగ్గుతున్నాయని మంత్రి తెలిపారు.
కరోనా కరోనా బాధితులకు నిత్యావసర వస్తువులు, మాస్కులు, ఇతర సదుపాయాల కోసం ఎర్రబెల్లి దయాకర్రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా దాతలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో దాదాపు కోటి రూపాయలు గత సంవత్సరం వ్యయం చేశామన్నారు.
ప్రస్తుతం ఇప్పటి వరకు రూ.40 లక్షల ఇప్పటి వరకు నిత్యావసర వస్తువులు, మాస్కులు, డ్రైప్రూట్స్, భోజనాల పంపిణీ చేశామని మంత్రి తెలిపారు. కొవిడ్ బాధితుల కోసం ప్రభుత్వ దవాఖానల్లో కొవిడ్ బాధితుల అన్ని సౌకర్యాలు కల్పంచామన్నారు.
ఎవరు కూడా ఆందోళ చెందాల్సిన పనిలేదని మంత్రి స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరు కొవిడ్ నిబంధనలు పాటించాలని మంత్రి పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి..
కరోనాతో మేడారం పూజారి సమ్మారావు మృతి
ఆకతాయిలను ఐసోలేషన్కు పంపించిన పోలీసులు
అడవి శ్రీరాంపూర్లో కరోనాతో భార్యాభర్తలు మృతి
రైతులకు పనిముట్లను అందజేసిన మంత్రి అల్లోల
లాక్ డౌన్ కేసులు 11,746 : ఎస్పీ వెంకటేశ్వర్లు
మేడారం పూజారి మృతిపట్ల మంత్రి సత్యవతి సంతాపం