మేడ్చల్ మల్కాజిగిరి : ప్రస్తుత పరిస్థితుల్లో హరితహారంకు మించిన గొప్ప కార్యక్రమం లేదు. భవిష్యత్తు కోసం, పుడమిని కాపాడేందుకు అందరు సమిష్టిగా మొక్కలను నాటాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శుక్రవారం మేడ్చల్ జిల్లా కిష్టాపురంలో ఉన్న 25 ఎకరాల విస్తీరణంలోని అటవీ శాఖ క్షేత్రంలో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, మేడ్చల్ జిల్లా కలెక్టర్ శ్రీమతి శ్వేత మహంతి తో కలిసి మొక్కలను నాటారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ఆకుపచ్చ తెలంగాణ ద్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న హరితహారం కార్యక్రమంలో ఏడవ విడత నిన్ననే ప్రారంభమైందన్నారు. హరితహారం ఆరు దశల్లో ఇప్పటి వరకు 220 కోట్ల మొక్కలను నాటగా, ఈ విడతలో మరో 20 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా నిర్ణయించబడిందని తెలిపారు. హరితహారం అమలు వల్ల తెలంగాణలో పచ్చదనం విస్తీర్ణం 23.4% శాతం నుంచి 28% శాతానికి పెరిగిందని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా తెలిపిందన్నారు.
పిల్లలు, భవిష్యత్తు తరాల కోసం మొక్కలు నాటి సంరక్షించాలన్న ఆలోచన అందరికీ రావాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర అటవీ శాఖ చీఫ్ కన్జర్వెటర్ అక్బర్, మేడ్చల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్యాంసన్, డీ.ఏప్.ఓ వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
వరంగల్లో ముగ్గురు గంజాయి స్మగ్లర్ల అరెస్టు
చెరువులో పడి ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి
సమస్త జీవకోటికి మొక్కలే ప్రాణాధారం
పల్లె ప్రగతికి సహకరిద్దాం పర్యావరణాన్ని కాపాడుకుందాం
న్యూజిలాండ్ సెలబ్రేషన్స్ చూసి తట్టుకోలేకపోయాం: అశ్విన్