రూ.8 కోట్ల విలువైన ట్యాబ్లెట్లు ఉచితంగా ఇస్తామన్న గ్రాన్యూల్స్
హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): కరోనా నేపథ్యంలో ప్రతి వారం కోటి పారాసిటమల్- 500ఎంజీ మందులను ఉచితంగా అందించేందుకు గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ ముందుకొచ్చింది. తమ వంతు సామాజిక బాధ్యతగా వచ్చే నాలుగు నెలల పాటు రూ.8 కోట్ల విలువ చేసే 16 కోట్ల మందులను అందిస్తామని పేర్కొన్నది.. ఈ మేరకు గ్రాన్యూల్స్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉమాదేవి చిగురుపాటి, ఇతర బృందం బుధవారం ఐటీశాఖ మంత్రి కేటీఆర్ను కలిసి వివరించారు. దేశవ్యాప్తంగా 6, విదేశాల్లో 1 ఒకటి కలిపి మొత్తం 7 తయారీ యూనిట్లు ఉన్నాయని.. ప్రజలకు అవసరమైన మందులను అందుబాటు ధరల్లో అందించేందుకు నిరంతరం కృషిచేస్తున్నట్టు ప్రతినిధులు తెలిపారు.