హైదరాబాద్ : తెలంగాణ కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 518 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ శుక్రవారం హెల్త్ బులిటెన్లో పేర్కొంది. తాజాగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,05,309కు చేరాయి. కొత్తగా 204 మంది కోలుకోగా ఇప్పటి వరకు.. 2,99,631 మంది డిశ్చార్జి అయ్యారు. మరో ముగ్గురు వైరస్ బారినపడి మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 1683కు పెరిగింది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 98.14శాతం, మరణాల రేటు 0.55శాతం ఉందని తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3,995 యాక్టివ్ కేసులున్నాయని, 1767 మంది హోంఐసోలేషన్లో ఉన్నారని ఆరోగ్యశాఖ వివరించింది. నిన్న ఒకే రోజు 57,548 శాంపిల్స్ పరీక్షించినట్లు చెప్పింది. ఇదిలా ఉండగా.. గతేడాది నవంబర్లో రాష్ట్రంలో 502 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏడాది కిత్రంతో నమోదైన కేసులతో పోలిస్తే వేగంగా వైరస్ వ్యాప్తి చెందుతోంది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్లో 157, మేడ్చల్ మల్కాజ్గిరిలో 44, రంగారెడ్డిలో 38, నిజామాబాద్లో 29, సంగారెడ్డిలో 21, మహబూబ్నగర్లో 20, కరీంనగర్లో 18 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి.