శంషాబాద్, మార్చి 25; శంషాబాద్ ఎయిర్పోర్టు కార్గో విభాగం ద్వారా వ్యాక్సిన్ రవాణా చేసేందుకు హైదరాబాద్కు చెందిన ‘స్టాట్విగ్’ స్టార్టప్తో జీఎంఆర్ సంస్థ ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. దీనిపై జీఎంఆర్ ఎయిర్పోర్టు కార్గో సీఈవో సౌరభ్కుమార్, స్టాట్విగ్ సహ వ్యవస్థాపకులు నృపుల్ పొనుగోటి, సీడీ చక్రవర్తి గురువారం సంతకాలు చేశారు. ఈ భాగస్వామ్యంతో శంషాబాద్ ఎయిర్పోర్టు కార్గో విభాగం రియల్ టైమ్ పద్ధతిలో వ్యాక్సిన్ల రవాణాను పర్యవేక్షించనున్నది.