వరంగల్ అర్బన్ : మాజీ మంత్రి ఈటల రాజేందర్కు మరో షాక్ తగిలింది. టీఆర్ఎస్ నుంచి దూరమయ్యాక తన వర్గాన్ని బలపరుచుకునే ప్రయత్నాలు ఆదిలోనే బెడిసి కొడుతున్నాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా హుజురాబాద్ నియోజక వర్గ ప్రజలు టీఆర్ఎస్ను వీడటం లేదు. రోజు రోజుకు టీఆర్ఎస్కు మద్దతుల వెల్లువ కొనసాగుతూనే ఉంది. తాజాగా జమ్మికుంట జడ్పీటీసీ శ్రీరామ్ శ్యాం ఈటలకు ఊహించని షాక్ ఇచ్చారు. ప్రాణం పోయిన పార్టీ మారను.
మా నాయకుడు సీఎం కేసీఆర్. 2001 నుంచి టీఆర్ఎస్తో ఉన్నా.. ఇప్పుడు కూడా పార్టీ తోనే ఉంటానని స్పష్టం చేశారు. హన్మకొండలో జమ్మికుంట టీఆర్ఎస్ నేతలతో కలిసి ప్రెస్ మీట్లో మాట్లాడారు. నేను ఈ స్థాయికి రావడానికి టీఆర్ఎస్ పార్టీనే కారణం. పార్టీ బీ ఫామ్ ఇచ్చి నన్ను జడ్పీటీసీని చేసిందని శ్రీరామ్ శ్యాం పేర్కొన్నారు.
మలిదశ ఉద్యమంలో నిబద్ధత, నిజాయితీతో పని చేశాం. ఇప్పుడు అదే నిబద్ధతతో పని చేస్తున్నామని తెలిపారు. హుజురాబాద్లో నెలకొన్న రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో మేమంతా టీఆర్ఎస్ వెంటే ఉంటామన్నారు. మేము కాదు హుజురాబాద్ నియోజక వర్గ ప్రజలు కూడా టీఆర్ఎస్ వెంటే ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
జమ్మికుంటను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మా పై ఉందన్నారు. సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయని ఆయన చెప్పారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మాపై ఉందని పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి నిస్వార్ధంతో చివరి శ్వాస వరకు కృషి చేస్తాని చెప్పారు.
కార్యక్రమంలో జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్ రావు, సర్పంచ్ల ఫోరమ్ అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ పొనగంటి సంపత్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఆపద వేళ ఎమ్మెల్యే సుమన్ ఆపన్న హస్తం
భద్రాద్రి జిల్లాలో తీరిన ఆక్సిజన్ కష్టాలు : మంత్రి పువ్వాడ
భూపాలపల్లిలో 30 పడకల కొవిడ్ వార్డు ప్రారంభం
అనాథ పిల్లలకు అండగా ఉంటాం: మంత్రి ఐకే రెడ్డి
సీఎం కేసీఆర్ నిర్ణయంతో వైద్య రంగం బలోపేతం
కరోనా పోవాలని ముత్నుర్లో మహిళల పూజలు