బాంబే హైకోర్టులో పిల్
కరోనా సంక్షోభ సమయంలో ఐపీఎల్ నిర్వహించిన బీసీసీఐకి రూ.వెయ్యి కోట్ల జరిమానా విధించి.. ఆ మొత్తాన్ని వైరస్ బాధితుల వైద్యం కోసం వినియోగించేలా ఆదేశించాలని బాంబే హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. వందన షా అనే న్యాయవాది ఈ పిల్ వేశారు. అలాగే జీవితాలు ప్రమాదంలో ఉన్న సమయంలో టోర్నీ నిర్వహించిన బీసీసీఐ.. భారతీయులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.