యాదాద్రి భువనగిరి : గ్రామ అభివృద్ధి కమిటీల సభ్యులు సమిష్టిగా పనిచేసి గ్రామాభివృద్ధిలో ఐక్యతను చాటుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రి గ్రామాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత తీసుకోని ఈనెల 22న గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకు శుక్రవారం గ్రామంలో గ్రామ సభ నిర్వహించి గ్రామ అభివృద్ధి కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 421 గ్రామ పంచాయతీలు ఉండగా ముఖ్యమంత్రి కేసీఆర్ వాసాలమర్రి గ్రామాన్ని దత్తత తీసుకోవడం గ్రామస్తుల ఆదృష్టమన్నారు.
గ్రామాభివృద్ధి కోసం అభివృద్ధిల కమిటీల సభ్యులు నిస్వార్థంగా సేవ చేయాలన్నారు. రెండు నెలల పాటు గ్రామాభివృద్ధి కమిటీల సభ్యులు గ్రామస్తులను కలుసుకొని గ్రామంలో శ్రమదానం చేసి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నారు. వాసాలమర్రి గ్రామానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్ని నిధులైన ఖర్చుచేసి అభివృద్ధి చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. దానికి అనుగుణంగా గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు అభివృద్ధిలో పాలుపంచుకోవాలన్నారు.
వాసాలమర్రి గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోని ఇతర గ్రామాలు రానున్న కాలంలో స్ఫూర్తి పొందనున్నాయన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గ్రామ సభలో అభివృద్ధి కమిటీని ఎన్నుకున్నారు. ప్రధాన కమిటీతో పాటు మరో 7కమిటీలు హరితహరం, పారిశుధ్యం, తాగునీరు, శ్రమదానం, ఆరోగ్యం, వ్యవసాయం,మౌలికవసతులు, మార్కెటింగ్ కమిటీలను ఏర్పాటు చేసుకున్నారు. సమావేశంలో డీఆర్డీవో ఉపేందర్రెడ్డి, సర్పంచ్ పోగుల ఆంజనేయులు, ఎంపీటీసీ పలుగుల నవీన్కుమార్ తదితరులున్నారు.
ఇవి కూడా చదవండి..
విషాదం : సంప్లో పడి వ్యక్తి మృతి
హుజురాబాద్ ప్రజలు ప్రలోభాలకు లొంగరు
రైతువేదికలు నిర్మించిన ఘనత సీఎం కేసీఆర్దే
పేదింటి ఆడబిడ్డలకు వరం కల్యాణలక్ష్మి
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే చల్లా
సీఎం కేసీఆర్ విగ్రహ ఏర్పాటుకు స్థల పరిశీలన