హైదరాబాద్ : దివంగత భారత మాజీ ప్రధాని, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు చిత్రపటాన్ని శుక్రవారం అసెంబ్లీ లాబీలో సీఎం కేసీఆర్ శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పీవీ శత జయంతి ఉత్సవాల విగ్రహ ప్రతిష్టాపన, వివిధ దేశాలలో చేపట్టే కార్యక్రమాలను పీవీ కమిటి చైర్మన్ కె కేశవరావు సీఎంకు తెలియ జేశారు.
ప్రపంచ వ్యాప్తంగా ఐదు దేశాలలో పీవీ విగ్రహాలని స్థాపించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ విగ్రహ ఖర్చులు అన్నీ ప్రభుత్వమే భరిస్తుందని సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ మేరకు పీవీ జయంత్య్సువాల కమిటీ సభ్యడు మహేష్ బిగాల సీఎం కేసీఆర్, కె కేశవరావుకు ధన్యవాదాలు తెలిపారు.